Restrictions on Use of mobile phones in the classrooms- guidelines

 Restrictions on Use of mobile phones in the classrooms- guidelines

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది.* విద్యార్థులు స్కూల్స్కు మొబైల్స్ తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించగా.. *ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లు ఉపయోగించడంపై ఆంక్షలు విధించారు.* టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల

తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వినియోగం, వినియోగ సమయం మరియు నియంత్రణ కోసం మార్గదర్శకాలు*
విద్యా సంస్థలలో మొబైల్ ఫోన్ వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి:
*1. ఉపాధ్యాయ బాధ్యతలు:*
 a.ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడూ మొబైల్‌ ఫోన్లను తరగతి గదులకు తీసుకెళ్లకూడదు.
 బి.ఉపాధ్యాయులు బోధనా సమయాల్లో సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం నిషేధించబడింది..
సి. ఉపాధ్యాయులు (ప్రధానోపాధ్యాయునితో సహా) ఉదయం వారి వారి హాజరును వేసిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌లను సైలెంట్‌గా మోడ్ లో ఉంచాలి..
ఒక ఉపాధ్యాయుడు బోధన కోసం మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలని భావిస్తే దాని గురించి తాను ముందుగానే తమ *లెసన్ ప్లాన్లో* మొబైల్ ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నామో రాసి ప్రధానోపాధ్యాయుని దగ్గర ఆ లెసన్ ప్లాన్ లో సంతకం చేయించుకొని ధ్రువీకరించుకున్న తర్వాత మొబైల్ ని ఉపయోగించాలి.
*ఇది స్పష్టంగా పేర్కొన్న విద్యా లక్ష్యాల ఆధారంగా ఉండాలి.*
 ఏదైనా అనివార్య కారణాల వల్ల మొబైల్ ఫోన్ తీసుకోవల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు పాఠశాల HT or HM నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి మరియు
సరైన కారణాలను నిర్వహించాల్సిన రిజిస్టర్‌లో నమోదు చేయాలి
*కారణం ఖచ్చితంగా వివరంగా ఉండాలి*
*పరిపాలనా బాధ్యతలు:*
 మొబైల్ వినియోగం అవసరమయ్యే అడ్మినిస్ట్రేటివ్ పనులు, ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు మార్కింగ్ యాప్, MDM మరియు ఇతర సూచించిన కార్యకలాపాలు *బోధన సమయం ప్రారంభానికి ముందే చేయాలి..*
 (అనగా 9.30కి ముందు ఉదయం లేదా సాయంత్రం 4 గంటల తర్వాత)
*క్రమశిక్షణా చర్యల అమలు:*
 ఈ ఆదేశాలను పాటించకుంటే అటువంటి చర్యలను తీవ్రంగా పరిగణించబడి తగిన కఠిన చర్యలు తీసుకోబడును...
*ఏదైనా ఉపాధ్యాయుడు బోధనా సమయంలో సెల్ ఫోన్ వినియోగ విధానాన్ని ఉల్లంఘిస్తే, ఈ క్రింది దశలలో చర్యలు తీసుకోబడును*
 *a.మొదటి నేరం:*
HM/Officer ద్వారా ఉపాధ్యాయుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మరియు పాఠశాల రోజు ముగిసే వరకు Office Roomలో ఉంచబడుతుంది.
రోజు చివరిలో ఇంకోసారి ఈ నేరాన్ని పునరావృతం చేయకూడదని వారిని మందలించి వారి ఫోన్ వారికి ఇవ్వడం జరుగుతుంది.
*బి.రెండవ నేరం:*
HM or Officer ద్వారా ఉపాధ్యాయుని మొబైల్ ఫోన్ లాక్కోబడుతుంది MEO గారికి ఈ విషయాన్ని తెలియపరచి  పాఠశాల రోజు ముగిసే వరకు ఆఫీసు రూమ్ లో ఉంచబడుతుంది. తర్వాత తగు వివరణ ఇచ్చి ఎంఈఓ గారి దగ్గర ఉపాధ్యాయులు తమ ఫోన్ ని తీసుకోవాలి.
*సి.మూడవ నేరం:*
ఉపాధ్యాయుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని DEO గారి కార్యాలయానికి పంపడం జరుగుతుంది..
తప్పు చేసిన ఉపాధ్యాయులు DEO గారికి తగు వివరణ ఇచ్చి ఆ వివరణని తమ సర్వీస్ పుస్తకంలో నమోదు చేసి తమ మొబైల్ ని తీసుకోవలసి ఉంటుంది.
AndhraPradesh: పాఠశాలలో మొబైల్ ఫోన్లు వాడారో ఇక అంతే సంగతులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
త‌ర‌గ‌తి గ‌దుల్లో ఉపాధ్యాయులు వృత్తిప‌ర‌మైన అవ‌స‌రాల‌కు కాకుండా వ్యక్తిగ‌త అవ‌స‌రాల కోసం మొబైల్ ఫోన్లు ఉప‌యోగిస్తూ బోధ‌నా స‌మ‌యాన్ని వృధా చేస్తున్నారంటోంది ప్రభుత్వం. అంతేకాదు యునెస్కో 2003 లో ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.ఆగస్టు మూడో తేదీన విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ నిర్వహించిన స‌మావేశంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‎లో ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో సెల్ ఫోన్లను నిషేధిస్తూ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి బోధ‌న స‌మ‌యంలో త‌ర‌గ‌తి గ‌దుల్లో సెల్‎ఫోన్‎లు వాడితే క‌ఠిన చర్యలు త‌ప్పవ‌ని హెచ్చరించింది. మొబైల్ ఫోన్లను వ్యక్తిగ‌త పనుల‌కు వాడుతూ విద్యార్ధుల‌కు న‌ష్టం క‌లిగిస్తున్నారంటోంది ప్రభుత్వం. బోధ‌నా ప్రమాణాల పెంపునకు ఇది ఆటంకంగా మారింద‌ని చెబుతోంది. త‌ర‌గ‌తి గ‌దిలో బోధ‌నా ప్రమాణాలు పెంచ‌డంలో భాగంగానే సెల్ ఫోన్ల వాడ‌కంపై నిషేదం విధించిన‌ట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. మొబైల్ ఫోన్లు ఎందుకు నిషేధిస్తున్నాం..ఉపాధ్యాయులు,విద్యార్ధులు ఎలాంటి నిబంధ‌న‌లు ఫాలో కావాలి.. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై ఎలాంటి చ‌ర్యలుంటాయి అనే అంశాల‌తో కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీఈవోలు,ఆర్జేడీల‌కు ఈ ఆదేశాలు క‌ఠినంగా అమ‌ల‌య్యేలా చూడాల‌ని సూచించింది.

త‌ర‌గ‌తి గ‌దుల్లో ఉపాధ్యాయులు వృత్తిప‌ర‌మైన అవ‌స‌రాల‌కు కాకుండా వ్యక్తిగ‌త అవ‌స‌రాల కోసం మొబైల్ ఫోన్లు ఉప‌యోగిస్తూ బోధ‌నా స‌మ‌యాన్ని వృధా చేస్తున్నారంటోంది ప్రభుత్వం. అంతేకాదు యునెస్కో 2003 లో ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.ఆగస్టు మూడో తేదీన విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ నిర్వహించిన స‌మావేశంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు. పాఠ‌శాల‌ల్లో టెక్నాల‌జీ వినియోగం-గుడ్ గ‌వ‌ర్నెన్స్‎కు సంబంధించి విద్యావేత్తలు,నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ ఆదేశాలిచ్చిన‌ట్లు పేర్కొంది.

సెల్ ఫోన్ స్కూల్ కు తీసుకెళ్తే ఎక్కడ ఉంచాలి…ఏం చేయాలి ?

నిపుణుల అభిప్రాయాల ఆధారంగా సెల్ ఫోన్‎ల వ‌ల్ల విద్యార్ధుల అక‌డ‌మిక్ పెర్మార్మెన్స్‎కు కు న‌ష్టం క‌లుగుతుంద‌నే ఉద్దేశంతోనే త‌ర‌గ‌తి గ‌దుల్లో బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది సర్కార్. మొబైల్ ఫోన్ వాడ‌కంపై టీచ‌ర్లతో పాటు విద్యార్దుల‌కు కూడా కొన్ని కండిష‌న్స్ పెట్టింది. త‌ర‌గ‌తి గ‌దుల్లోకి ఉపాధ్యాయులు సెల్ ఫోన్ తీసుకెళ్లకూడ‌దు. బోధ‌నా స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఫోన్ వాడ‌కూడ‌ద‌ని పేర్కొంది. త‌ర‌గ‌తిలో విద్యార్ధుల హాజ‌రు తీసుకున్న త‌ర్వాత మొబైల్ ఫోన్ ల‌ను సైలెండ్ మోడ్ లో పెట్టి హెడ్మాస్టర్‎కు అప్పగించాల్సి ఉంటుంద‌ని స్పష్టం చేసింది. ఒక‌వేళ కరికుల‌మ్‎కు సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటే ముందుగానే హెడ్మాస్టర్ అనుమ‌తి తీసుకోవాల‌ని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మ‌రోవైపు విద్యార్ధులు కూడా మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా కొన్ని కండిష‌న్ లు పెట్టింది. త‌ర‌గ‌తి గ‌దుల్లో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకూడ‌దు.హెడ్మాస్టర్ గ‌దిలో లేదా క్లర్క్ వ‌ద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అత్యవ‌స‌రం అయితే హెడ్మాస్టర్ అనుమ‌తి తీసుకుని ఉప‌యోగించాల్సి ఉంటుంది. త‌ర‌గ‌తి గ‌దుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసి ఎల్‏ఈడీ ప్యాన‌ళ్లు, స్మార్ట్ టీవీల‌ను కేవ‌లం బోధ‌న కొర‌కు మాత్రమే ఉప‌యోగించాల‌ని పేర్కొంది. ఉపాధ్యాయులు ఉద‌యం తొమ్మిదిన్నరకు ముందు సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాత మాత్రమే సెల్ ఫోన్ వినియోగించాల్సి ఉంటుంది. ఒక‌వేళ అటెండెన్స్ తీసుకోవ‌డం ఆల‌స్యం అయితే సంబంధిత హెడ్మాస్టర్ అనుమ‌తితో సెల్ ఫోన్ ఉప‌యోగించాల్సి ఉంటుంది. 

మొద‌టి సారి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే మ‌రోసారి ఇలా చేయ‌మ‌ని సంబంధిత ఉపాధ్యాయుడు.. హెడ్మాస్టర్‎కు రాత‌పూర్వకంగా వివ‌రణ ఇవ్వాల్సి ఉంటుంది. 

రెండోసారి మండ‌ల విద్యాశాఖాధికారితో మాట్లాడిన త‌ర్వాత మాత్రమే సెల్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. 

మూడోసారి గ‌నుక రిపీట్ అయితే ఉపాధ్యాయుడి సెల్ ఫోన్‎ను డీఈవో‎కు స‌రెండ‌ర్ చేయాల్సి ఉంటుంది. డీఈవోతో చ‌ర్చించిన త‌ర్వాత మాత్రమే స‌ర్వీస్ రిజిస్టర్‎లో న‌మోదు చేసి సెల్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది.

సెల్ ఫోన్ వాడ‌కంపై విద్యార్ధులు,ఇత‌రులు ఫిర్యాదు చేస్తే హెడ్‌మాస్టర్లే బాధ్యులు

పాఠ‌శాల విద్యాశాఖ అధికారులు అక‌స్మిక త‌నిఖీల స‌మ‌యంలో సెల్ ఫోన్ నిషేధం నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా అమ‌లవుతున్నాయో లేదో చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బ‌య‌టి వ్యక్తులు గాని విద్యార్ధులు గానీ నిబంధ‌న‌ల విష‌యంలో ఫిర్యాదు చేస్తే సంబంధిత పాఠ‌శాల హెడ్మాస్టర్‎ను బాధ్యులు చేసేలా ఆదేశాలిచ్చింది. పాఠ‌శాల‌ల్లో త‌నిఖీల స‌మ‌యంలో నిబంధనలు ఉల్లంఘించనట్లు తేలితే హెడ్మాస్టర్లదే బాధ్యత అని పాఠ‌శాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. కొన్ని రోజుల పాటు ఈ నిబంధ‌న‌ల‌కు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పాఠ‌శాల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన త‌ర్వాత క‌ఠినంగా అమ‌లుచేయాల‌ని అధికారులకు పాఠ‌శాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.